వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్ దాడి: అమరులకు అమిత్ షా నివాళి -నక్సలిజానికి ముగింపు తప్పదన్న కేంద్ర హోం మంత్రి

|
Google Oneindia TeluguNews

దేశంలో వామపక్ష తీవ్రవాదం సృష్టించిన అశాంతికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి తార్కిక ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని, మావోయిస్టులు సహా నక్సలిజాన్ని అంతం చేస్తామని, జవాన్ల బలిదానాలకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల దాడి నేపథ్యంలో సోమవారం ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన ఆయన తొలిసారిగా బస్తర్ అడవుల్లోకి వెళ్లారు.

మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భ‌గేల్ లు సోమవారం నివాళులు అర్పించారు. జవాన్ల పార్ధివదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జ‌గ‌ద‌ల్‌పూర్‌లో 14 మంది అమ‌ర జ‌వాన్ల మృత‌దేహాల‌ను ఉంచారు. మావోయిస్టుల దాడిలో మొత్తం 24 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది జ‌వాన్ల మృత‌దేహాలు మాత్రమే ల‌భ్య‌మ‌య్యాయి.

రాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేతరాఫెల్ కుంభకోణం: షాకింగ్ ట్విస్ట్ -భారతీయ మధ్యవర్తికి భారీగా లంచం -దసాల్ట్ రికార్డుల్లో పట్టివేత

Chhattisgarh attack: Amit Shah pays tribute to martyrs, says Govt determined to end Naxal menace

జ‌గ‌ద‌ల్‌పూర్‌లో అమరులకు నివాళులు అర్పించిన తర్వాత హోం మంత్రి అమిత్ షా.. బీజాపూర్ - సుక్మా జిల్లాల స‌రిహ‌ద్దులో దాడి ఘటన చోటుచేసుకున్న టెర్రాం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో ఆయన స‌మీక్ష చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ‌వాన్ల‌ను అమిత్ షా ప‌రామ‌ర్శించారు.

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

Chhattisgarh attack: Amit Shah pays tribute to martyrs, says Govt determined to end Naxal menace

ఛత్తీస్ గఢ్ లో శనివారం నాటి మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు చనిపోగా, 31 మంది జవాన్లు గాయపడ్డారు. చనిపోయిన జవాన్లలో ఎపికి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్ ఉన్నారు. ఈ ఇద్దరు కోబ్రా 210 దళంలో జవాన్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో పుల్వామా దాడి తర్వాత భారత భద్రతా బలగాలపై జరిగిన రెండో అతిపెద్ద దాడిగా టెర్రాం ఎన్ కౌంటర్ నిలిచింది.

English summary
Union Home Minister Amit Shah on Monday said that the government is determined to take the ongoing fight against the unrest created by Naxals to its logical conclusion. The minister, who is on a visit to Chhattisgarh, made the comment after paying tributes to the 22 security personnel who were killed by Naxals in the state on Saturday. "Paid tributes to the brave security personnel who were martyred while fighting the Naxalites at Jagdalpur in Chhattisgarh," he said in a tweet in Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X