చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు..అరెస్ట్‌కు సిద్దం

Recommended Video

    గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు || P.Chidambaram In Court Today || Oneindia Telugu

    కేంద్రమాజీ పి. చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటు వేయడంతో అధికారులు మరి గోడదూకి వెళ్లారు. దీంతో సిబ్బందిని లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. సిబీఐ,ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సహాకారం ఉన్నా గోడదూకి లోపలికి వెళ్లారు. అయితే ఇప్పటి వరకు అధికారులు మాత్రం ఇంట్లోకి వెళ్లలేక పోయారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదన్నట్టుగా సిబిఐ అధికారులు వ్యవహరిస్తున్నారు..అయితే సీబీఐతో చిదంబరం ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మాత్రం ఆయన ఇంటి నుండి వెనక్కి మళ్లారు..కాని సిబిఐ మాత్రం ఇంకా ఇంటి అవరణలోనే వేచి చూస్తున్నారు.

    Chidambaram at home, CBI team enter Chidambarams residence, jumps over wall to enter

    కాగా అంతకుముందు ఏఐసీసీ కార్యాయంలో మాట్లాడిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జీషీట్‌లో తనపేరు లేదని పేర్కొన్నారు. ముడుపులకు సంబంధించి ఆరోపణలు లేవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో తనను ఇరికించడం ఏంటీ అని ప్రశ్నించారు.

    ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై నిన్నటి నుంచి తన లాయర్లతో సంప్రదింపులు జరిపానని పేర్కొన్నారు. తానేం తప్పుచేయలేదని .. ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. ఓ పౌరుడిగా తిరిగే అధికారం తనకు ఉందని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తానని .. దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+