చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదన
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను సీబీఐ విచారించినట్లు సమాచారం. ఆ తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టింది.
సుదీర్ఘమైన కేసు కావడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమకు మరింత సమయం కావాలని, అందుకు చిదంబరంను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ.. కోర్టులో వాదనలు వినిపిస్తోంది. ఈ కేసులో చిదంబరంపై బలమైన అభియోగాలున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరపున వాదించారు.

ఇక చిదంబరం తరపు న్యాయవాదులు మాత్రం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. చిదంబరం, కార్తీ చిదంబరం తరపున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ, వివేక్ తంఖాలు వాదనలు వినిపిస్తున్నారు.
INX Media Case: P. Chidambaram produced in CBI court; hearing begins. https://t.co/0q8HjenRai
— ANI (@ANI) August 22, 2019
కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలాఉండగా, కోర్టు రూంలో కార్తీ చిదంబరం భార్య నళిని, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. దయన్ కృష్ణన్ తోపాటు ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా కోర్టు రూంలో ఉన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications