తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..!
తమిళనాడు (tamil nadu), పశ్చిమ బెంగాల్లో (west bengal) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు సహా అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల వేళ విపక్ష ఎంపీలు లేకుండా పార్లమెంట్ ఎలా నడుపుతారని విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి చిదంబరం (chidambaram)కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. ఏప్రిల్ 16-18 తేదీలలో పార్లమెంటును సమావేశపరచాలన్న ప్రతిపాదన దురుద్దేశపూరితమైనదని, దీనిని తప్పక వ్యతిరేకించాలని చిదంబరం పిలుపునిచ్చారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఏప్రిల్ 23న (పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 29న రెండోదశ) పోలింగ్ జరగనుంది.

The proposal to convene Parliament on April 16-18 is mischievous and must be opposed
— P. Chidambaram (@PChidambaram_IN) April 5, 2026
Polling in Tamil Nadu and West Bengal are scheduled on April 23 (and April 29 in WB)
39 MPs of TN and 28 MPs of WB are in the Opposition benches in the Lok Sabha. They will be fully engaged in…
లోక్సభలో ప్రతిపక్ష బెంచీలలో తమిళనాడుకు చెందిన 39 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్కు చెందిన 28 మంది ఎంపీలు ఉన్నారని, ఏప్రిల్ 16-18 తేదీలలో వారు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారని చిదంబరం గుర్తుచేశారు. ఆ తేదీలలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను చర్చకు, ఓటింగ్కు తీసుకువస్తే, లోక్సభలోని ఈ 67 మంది ఎంపీలు ఎలా పాల్గొని ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎంపీలను మినహాయించడమే దీని వెనుక ఉన్న కుట్ర అని తాను అనుమానిస్తున్నట్లు చిదంబరం తెలిపారు.
-
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యం- థోళ్ తిరుమావళన్ యూటర్న్ -
తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!! -
Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత? -
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??













Click it and Unblock the Notifications