వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ, అమిత్ షా ఎఫెక్ట్: కర్ణాటక మలెనాడులో కాంగ్రెస్ కు భారీ దెబ్బ, సిట్టింగ్ ఎమ్మెల్యే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మలేనాడు, కాఫీతోటలకు నిలయం అయిన చిక్కమగళూరు జిల్లాలో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించింది. చిక్కమగళూరు జిల్లాలోని ఐదు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసిన బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించింది.

కర్ణాటక గాంధీ

కర్ణాటక గాంధీ

కర్ణాటక గాంధీగా పేరు తెచ్చుకుని అతి సామాన్య జీవితం గడుపుతూ విదాన సౌధకు ఆటోలో, ఆర్టీసీ బస్సుల్లో తిరిగే జేడీఎస్ పార్టీ నేత, కడూరు ఎమ్మెల్యే వైఎస్.వి దత్తా ఈ ఎన్నికల్లో ఓటమిపాలైనారు. చిక్కమగళూరు జిల్లాలో మే 12 జరిగిన శాసన సభ ఎన్నికల్లో కుల రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

కులాలు, మతాలు

కులాలు, మతాలు

ఒక్కలిగ, లింగాయత్ కులస్తుల ఓట్లు చీల్చడంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విఫలం అయ్యాయి. చిక్కమగళూరు జిల్లాలో ఒక్కలిగ, లింగాయత్, బిల్లద, బ్రాహ్మాణ, ఒంటి, ముస్లీం, క్రైస్తవ, జైన్ మతస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే 2013 శాసన సభ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఫలితాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.

శృంగేరి కాంగ్రెస్ దెబ్బ

శృంగేరి కాంగ్రెస్ దెబ్బ

చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే డీఎన్. జీవరాజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిడి. రాజేగౌడ చేతిలో ఓడిపోయారు. చిక్కమగళూరులోని మిగిలిన నాలుగు శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.

నాలుగు సీట్లు

నాలుగు సీట్లు

మూడిగెరెలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మోటమ్మ మీద ఎంపీ. కుమారస్వామి, చిక్కమగళూరులో కాంగ్రెస్ పార్టీ లీడర్ బీఎల్. శంకర్ మీద సీటీ రవి, తరికెరేలో స్వతంత్రపార్టీ అభ్యర్థి జీహెచ్. శ్రీనివాస్ మీద బీజేపీ లీడర్ డీఎస్. సురేష్, కడూరులో జేడీఎస్ ఎమ్మెల్యే వైఎస్ వీ. దత్తా మీద బెళ్లి ప్రకాష్, శృంగేరీలో బీజేపీ అభ్యర్థి డీఎన్. జీవరాజ్ మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ టీడీ. రాజేగౌడ విజయం సాధించారు.

మోడీ, అమిత్ షా

మోడీ, అమిత్ షా

చిక్కమగళూరు జిల్లాలోని ఐదు శాసన సభ నియోజక వర్గాల్లోని నాలుగు శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసినప ప్రచారంతో చిక్కమగలూరు జిల్లాలో బీజేపీ ఊహించినదానికంటే ఒక్కసీటు తగ్గిపోయింది.

English summary
Karnataka Assembly elections 2018 : Here is Chikmagalur district results. Get complete information about winners and losers with their constituencies and party. BJP secured 4 out of 5 constituencies losing Sringeri to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X