భారత్ పై చైనా మరోదుశ్చర్య; పవర్ గ్రిడ్ లే టార్గెట్ గా రంగంలోకి చైనాహ్యాకర్లు
డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సరానికి పైగా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం లడఖ్ సమీపంలో తన కార్యకలాపాలను చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం భారత్ కు ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా భారత సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. హ్యాకర్ ల సహాయంతో సరిహద్దుల్లో ఉన్న విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ కు ప్రయత్నం చేసింది. ఇక ఈ విషయాన్ని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ బయటపెట్టింది. లడఖ్ రీజియన్లోని పవర్ గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ సంస్థ ధ్రువీకరించింది.

లడఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా
చైనా ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఇటీవలి నెలల్లో లడఖ్ సమీపంలోని భారతీయ విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో రెండు దేశాల మధ్య నెలల తరబడి సైనిక ప్రతిష్టంభన తరువాత ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఇటీవలి నెలల్లో, ఈ రాష్ట్రాలలో గ్రిడ్ నియంత్రణ మరియు విద్యుత్ పంపకం కోసం రియల్ టైం కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్లను (SLDCలు) లక్ష్యంగా చేసుకుని నెట్వర్క్ చొరబాట్లను తాము గమనించినట్టుగా వెల్లడించింది.

స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లలో హ్యాకింగ్ యత్నం... చైనా అధికారిక సైబర్ నేరగాళ్ళ పనే
ముఖ్యంగా, ఈ లక్ష్యం భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గుర్తించబడిన స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ లు ఉత్తర భారతదేశంలో, లడఖ్లోని వివాదాస్పద భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నాయని ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ఇక హ్యాకింగ్ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్ సెంటర్ల నుంచి వచ్చినవేనంటూ సదరు ఇంటిలిజెంట్ సంస్థ నివేదిక వెల్లడించింది.

ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన ఇంటిలిజెన్స్ సంస్థ
పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు, జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. రికార్డెడ్ ఫ్యూచర్ నివేదికను ప్రచురించే ముందు తమ పరిశోధనల గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల నుండి బెదిరింపులను గుర్తించడంలో ప్రత్యేకతతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పరిగణించబడుతున్న ఇంటెలిజెన్స్ సంస్థ ప్రకారం, చైనా కోసం దాడి చేసేవారు భారత్లోని క్లిష్టమైన మౌలిక సదుపాయాల వ్యవస్థల గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
Recommended Video


సంక్లిష్ట వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం చొరబాట్ల లక్ష్యం
గత 18 నెలలుగా భారతదేశంలోని రాష్ట్ర మరియు ప్రాంతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్ల నిరంతర లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొదట రెడ్ ఎకో నుండి మరియు ఇప్పుడు TAG-38 కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్ ఉపయోగం కోసం సామర్థ్యాలను అభివృద్ధి చేయడం లేదా భవిష్యత్ ఆకస్మిక కార్యకలాపాలకు సన్నాహకంగా సిస్టమ్ అంతటా తగినంత ప్రాప్యతను పొందడం కోసం ఈ సంక్లిష్ట వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం చొరబాట్ల లక్ష్యం అని రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications