టిబెట్ పీఠభూమిలో బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్స్: గోబీ ఎడారి మీదుగా: రెచ్చగొడుతోన్న చైనా
న్యూఢిల్లీ: చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత్ తనవంతు ప్రయత్నాలను కొనసాగిస్తుండగా.. దానికి విఘాతం కలిగించేలా చైనా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బలపరిచేలా.. సరిహద్దుల్లో చైనా తన సైనిక బలగాన్ని మరింత పెంచింది. యుద్ధ సామాగ్రిని తరలించింది.
Recommended Video

టిబెట్ పీఠభూమిలో భారీగా మోహరింపు..
తాజాగా టిబెట్ పీఠభూమిని చైనా తన సైనిక బలగాలతో నింపేసింది. కొత్తగా బాంబర్లను మోహరింపజేసింది. ఎయిర్ డిఫెన్స్ ట్రూప్, స్పెషల్ ఫోర్స్ను టిబెట్ పీఠభూమికి తరలించింది. హెచ్-6 బాంబర్లు, వై-20 ఎయిర్క్రాఫ్ట్స్ను తరలించింది. భారీ పరిమాణంలో యుద్ధ సామాగ్రిని తరలించగల శక్తి సామర్థ్యాలు వై-20 ఎయిర్ క్రాఫ్ట్స్కు ఉన్నాయి. వాటితో పాటు హెచ్జే-10 యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పొరుగు దేశాల సరిహద్దుల నుంచి
చైనా తన పొరుగు దేశాల సరిహద్దుల నుంచి టిబెట్ పీఠభూమికి భారీ ఎత్తున సైన్యాన్ని తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 71వ గ్రూప్ ఆర్మీని చైనా బరిలోకి దింపింది. హెచ్జే-10 యుద్ధ ట్యాంకులతో కూడిన ఈ ఆర్మీ గ్రూప్ చైనా ఈశాన్య ప్రాంతంలోని గ్ఝియాన్షు ప్రావిన్స్ నుంచి గోబీ ఎడారి మీదుగా వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి టిబెట్ పీఠభూమికి చేరుకుంది. మరిన్ని బలగాలను తరలిస్తోంది.

యుద్ధానికి సమాయాత్తమౌతోందా?
టిబెట్ పీఠభూమిలో చైనా తరలిస్తోన్న యుద్ధ సామాగ్రిని చూస్తోంటే.. యుద్ధానికి సమాయాత్తమౌతున్నట్లే కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, ఆర్టిల్లరీ, యుద్ధ సామాగ్రిని తరలంచే భారీ వాహనాలు, పారా ట్రూపర్లు, ఇన్ఫాంట్రీ యూనిట్లను ఇతర దేశాల సరిహద్దుల నుంచి రప్పిస్తోంది. కిందటి నెల 29, 30 తేదీల్లో పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్పాయ్ పర్వతంపై రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ, వార్నింగ్ షాట్ ఫైరింగ్ తరువాతే చైనా.. టిబెట్ పీఠభూమిలో సైనిక బలగాలను పెంచింది.

విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేపథ్యంలో..
ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తోన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో చైనా కౌంటర్ పార్ట్ వాంగ్ యీ భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య లంచ్ మీటింగ్ ఏర్పాటు కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ ఏర్పాటవుతుందని భావిస్తోన్న తరుణంలోనే చైనా తన సైనిక బలగాలను మోహరింపజేసింది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications