మారని చైనా తీరు-వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఎయిర్ క్రాఫ్ట్ తో కవ్వింపులు
భారత్-చైనా మధ్య కరోనా సమయంలో సరిహద్దుల్లో ప్రారంభమైన ఉద్రిక్తతల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా వాటి ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. కేవలం కొన్ని సెక్టార్లలో సైన్యం ఉపసంహరణలు మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఇలాంటి సమంలో తాజాగా మరోసారి చైనా కవ్వింపులకు దిగింది.
లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి చొచ్చుకొచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చక్కర్లు కొట్టింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. జూన్ చివరి వారంలో తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వద్ద చైనా విమానం భారత స్థానాలకు చాలా దగ్గరగా వచ్చింది. భారత వైమానిక దళం వెంటనే స్పందించి, సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో దూరంగా వెళ్లిపోయింది. చైనా ఏదైనా దుస్సాహసాన్ని దిగితే బదులుచెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
తూర్పు లడఖ్ సెక్టార్లో చైనా వైపు గత కొన్ని నెలల్లో గగనతల ఉల్లంఘన జరగడం ఇదే మొదటి సారి అని సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన IAF రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించింది తూర్పు లడఖ్కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అలాగే డ్రిల్ల సమయంలో వాయు రక్షణ ఆయుధాలను ప్రధాన మార్గంలో ఉపయోగించింది.
ఈ విషయాన్ని చైనీయులతో చేసుకున్న నిబంధనల ప్రకారం పరిష్కరించే దిశగా భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అప్పటి నుంచి భారత్తో సరిహద్దు ప్రాంతాల్లో చైనీయులు అలాంటి పనులు చేయలేదు. చైనీయులు 2020లో చేసిన విధంగానే ఏదైనా దుస్సాహసాన్ని చేస్తే తూర్పు లడఖ్ సెక్టార్లో కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం తెలిపింది.