సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత: చైనా వైమానిక బలగాలు, రాడార్లు: ధృవీకరించిన ఎయిర్ చీఫ్ మార్షల్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు కనిపిస్తోంది. లఢక్ తూర్పు సెక్టార్ పరిధిలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా తన వైమానిక బలగాలను మోహరింపజేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖకు అవతల కాపుగాసిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలకు అండగా.. వైమానిక దళాన్ని పంపించింది. వాస్తవాధీన రేఖ సమీపంలో రెండంచెల రక్షణ వ్యూహాన్ని పన్నినట్లు తేలింది.
ఈ విషయాన్ని భారత వైమానికదళాధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భడౌరియా స్వయంగా ధృవీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడంచారు. తాము అంచనా వేసిన దాని కంటే పెద్ద ఎత్తున చైనా తన వైమానిక దళాన్ని లఢక్ వాస్తవాధీన రేఖ వద్దకు తరలించినట్లు పేర్కొన్నారు. దీనికి ధీటుగా తాము సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చైనా వ్యూహాలను చిత్తు చేసేలా వ్యవహరిస్తామని, దీనికోసం అన్ని జాగ్రత్తలను చేపట్టామని అన్నారు.

వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రామానికి భడౌరియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ అనుసరిస్తోన్న వ్యూహాల గురించి ఆయన ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. కొంతకాలంగా లఢక్ వాస్తవాధీన రేఖ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని చెప్పారు. తాజాగా చైనా తన మోహరింపును మరింత బలోపేతం చేసిందని అన్నారు. ఆర్మీకి మద్దతుగా వైమానిక బలగాలను పిలిపించిందని పేర్కొన్నారు.
చైనా రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోందని, రాడార్లు, ఉపరితలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సంధించే సామాగ్రిని తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందని భడౌరియా అన్నారు.. దీనికి ధీటుగా తాము స్పందిస్తామని, అదే స్థాయిలో సైన్యాన్ని సరిహద్దులకు పంపిస్తున్నామని చెప్పారు. సుఖోయ్-30 ఎంకేఐ, బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే సామాగ్రిని తరలించే అవకాశాలు లేకపోలేదని అన్నారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications