కాంగ్రెస్పై బీజేపీ బిగ్ బాంబ్... చైనా నుంచి విరాళాలు... సంచలన ఆరోపణలు..
ప్రధాని నరేంద్ర మోదీ చైనా దూకుడుకు లొంగిపోయి భారత భూభాగాన్ని వదిలిపెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతకొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దు విషయాల్లో రాజకీయం వద్దంటూ నిన్న మొన్నటిదాకా రాహుల్ నోటికి తాళం వేసేందుకు ప్రయత్నించిన బీజేపీ.. తాజాగా పదునైన అస్త్రాన్ని వదిలింది. లొంగిపోయింది తాము కాదని... ఒకప్పుడు చైనా ఇచ్చిన విరాళాలు తీసుకుని వారికి మేలు చేసేలా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెర పైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు.

అప్పటి వార్షిక రిపోర్టులో...
2005-06 సంవత్సరంలో సోనియా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ ఫౌండేషన్కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. సాధారణ దాతల జాబితాలోనే దీన్ని కూడా చేర్చినట్టు చెప్పారు.రాజీవ్ ఫౌండేషన్కు సంబంధించిన అప్పటి వార్షిక రిపోర్టు ఆధారంగానే ఈ విషయం చెబుతున్నట్టుగా పేర్కొన్నారు.

అది నిజం కాదా...?
'అప్పటి యూపీఏ ప్రభుత్వం చైనా నుంచి లంచం తీసుకుందా...? ఆ విరాళాలు తీసుకున్న తర్వాతే చైనాకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా భారత్తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని రాజీవ్ ఫౌండేషన్ సిఫారసు చేసిన మాట నిజం కాదా..?' అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. చైనా నుంచి తీసుకున్న ఆ విరాళాలను ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా పేర్కొనలేదని ఆరోపించారు. చైనా నుంచి డబ్బు తీసుకున్నారో లేదో... తీసుకుంటే ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.

చైనాతో రహస్య ఒప్పందం....
2008లో చైనాతో కాంగ్రెస్ రహస్యం ఒప్పందం చేసుకుందని కూడా బీజేపీ ఆరోపించింది. అప్పట్లో చైనా ఎంబసీ అధికారులతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ సమావేశమయ్యారని చెప్పింది. ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీపై కూడా రవిశంకర్ ప్రసాద్ పలు ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇందిరా గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికవగా... అధికార దుర్వినియోగంతో ఆమె గెలుపొందారన్న ఆరోపణలతో అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను పక్కనపెట్టిందని గుర్తుచేశారు. దీంతో కేవలం తన ప్రధాని పీఠాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇందిరా దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు.

ఇందిరా ఎమర్జెన్సీపై కేంద్రమంత్రి ఫైర్...
ఈరోజు మనం జూన్ 25,1975న విధించిన ఎమర్జెన్సీ నాటి క్రూర పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ పీరియడ్లో జేపీ నారాయణ్,అటల్ బిహారీ వాజ్పెయ్,చంద్రశేఖర్,ఎల్కె అద్వానీ,జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నేతలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఆఖరికి మీడియాను,న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టలేదని... కాంగ్రెస్ ఏది అనుకుంటే అది చేసిందని ఆరోపించారు.
Recommended Video

ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలను కొట్టిపారేసింది. కేవలం చైనాతో ఘర్షణలు,ఉద్రిక్తతల నుంచి భారతీయుల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. అప్పట్లో చైనా ఎంబసీ నుంచి అందుకున్న విరాళం నిష్పక్షపాతంగా జరిగిందేనని... వెబ్ సైట్లో అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వివేకానంద ఫౌండేషన్ లాంటి సంస్థలు కూడా వివిధ మార్గాల ద్వారా విరాళాలు స్వీకరించాయని.. అంతమాత్రాన ఆ సంస్థలను దేశ ద్రోహుల జాబితాలో చేర్చలేమని బదులిచ్చింది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications