కుప్పకూలిన ఎయిర్క్రాఫ్ట్: పైలట్ మృతి, ట్రైనీ పైలట్కు తీవ్రగాయాలు
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో చాపర్ ప్రమాదం చోటు చేసుకుంది. శిక్షణ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందగా, మరో మహిళా పైలట్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అప్పటికే
చేరుకున్న
స్థానికులు
సహాయక
చర్యల్లో
పాల్గొన్నారు.
ఫ్లయింగ్
స్కూల్కు
చెందిన
చిన్నపాటి
ట్రైనింగ్
ఎయిర్క్రాఫ్ట్లో
ఇద్దరు
పైలట్లు
ప్రయాణిస్తుండగా
శుక్రవారం
సాయంత్రం
4
గంటల
ప్రాంతంలో
ఒక్కసారిగా
కుప్పకూలింది.
ఈ విమానం ధూలేలోని శ్రీ విలేపార్లే కెల్వాని మండలానికి చెందిన ఎన్ఎంఐఎంఎస్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్కు చెందినది. ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ జల్గావ్ లోని చోప్డా సరిహద్దుల దగ్గర కుప్పకూలింది. ఎయిర్క్రాఫ్ట్లో పైలట్ శిక్షకుడు చనిపోయినట్లు తెలిపిన అధికారులు.. విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. గాయపడిన ట్రైనీని నానావతి ఆసుపత్రికి తరలిస్తున్నారు.
సాంకేతిక లోపం కారణంగానే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. పైలట్ మరణించడం తనను బాధించిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Shocked to hear about the tragic crash of a training aircraft that belonged to the NMIMS Academy of Aviation, Maharashtra. An investigation team is being rushed to the site.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 16, 2021
1/2