వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహితీవేత్త హత్య: శ్రీ రామ్ సేన నాయకుడి విచారణ

|
Google Oneindia TeluguNews

మంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీవేత్త డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ పోలీసులు (సీసీబీ) శ్రీరామ్ సేన నాయకుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

శ్రీరామ్ సేన నాయకుడు ప్రసాద్ అత్తావర్ ను గురువారం మంగళూరులో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య జరిగిన తరువాత ఈ హత్యను సమర్థిస్తు ప్రసాద్ మెసేజ్ లు పంపించారని పోలీసులు అంటున్నారు.

City Crime Branch is questioning a Shri Ram Sena activist in Mangaluru

అంతే కాకుండ సాహితీవేత్త ఎం.ఎం. కలబుర్గిని హత్య చేసిన వారితో ప్రసాద్ కు సంబంధాలు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలబుర్గి హత్య జరిగిన తరువాత బంట్వాళ పోలీసులు భవిత్ శెట్టి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

భవిత్ శెట్టి సైతం కలబుర్గి హత్యను సమర్థిస్తు రెండు ట్వీట్ లు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సాహితీవేత్త కలబుర్గిని ఆగస్టు 31వ తేదిన ఆయన ఇంటిలోనే రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

English summary
City Crime Branch is questioning a Shri Ram Sena activist in connection with the murder of Professor M.M.Kalburgi. The activist Prasad Attavar had posted a message justifying the killing of Kalburg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X