భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు

భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

చైనా-భారత్ భద్రతా బలగాలు వివాదాస్పద సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలకు దిగినట్లు భారత మీడియా వార్తలు ప్రచురించింది. రెండు వైపులా భద్రతా సిబ్బంది గాయపడినట్లు పేర్కొంది.

ఉత్తర సిక్కింలో మూడు రోజుల క్రితం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.

గత ఏడాది జూన్‌లో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 20మంది భారత సైనికులు మరణించారు. వీటిలో మరణించిన చైనా సిబ్బందిపై ఎలాంటి సమాచారం లేదు.

తాజాగా సిక్కింలోని నకులా పాస్ దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సైనిక అధికారుల సమాచారం.

భారత ప్రాంతాల్లోకి గస్తీ కాస్తున్న చైనా బృందం ప్రవేశించేందుకు ప్రయత్నించిందని, వారిని బలవంతంగా వెనక్కి పంపించామని అధికారులు తెలిపారు.

సైన్యం

'అన్నీ సర్దుకున్నాయి.. మీడియా సంయమనం పాటించాలి’

'సిక్కిం సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణకు సంబంధించి మాకు చాలా ప్రశ్నలొస్తున్నాయి.

సిక్కిం ఉత్తర ప్రాంతంలోని నకులా ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 20న రెండు దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది.

ప్రోటోకాల్స్ ప్రకారం స్థానిక కమాండర్ల మధ్య చర్చలతోనే ఆ సమస్య పరిష్కారమైపోయింది.

అవాస్తవాలు రాయకుండా మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం'' అని ప్రభుత్వ, సైనిక వర్గాలు చెప్పాయి.

కాగా ఈ అంశంపై చైనా వైపు నుంచి ఇంకా స్పందన లేదు.

భూటాన్, నేపాల్, చైనాల కూడలిలో సిక్కిం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+