150 స్కూళ్లలో ఒక్కరూ పాస్ అవలేదు: మా ఘనతే అన్న సీఎం యోగి
లక్నో: గతేడాదితో పోలిస్తే ఉత్తరప్రదేశ్ లో 10,12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. దాదాపు 150స్కూళ్లలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. చూడటానికి ఇదంతా విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్ లా కనిపిస్తున్నా.. కాదు, అది మా ఘనత అని చెబుతున్నారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
పరీక్షల్లో కాపీయింగ్ ను అరికట్టినందువల్లే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పడిపోయిందని, ఆవిధంగా తమ సర్కార్ విజయం సాధించినట్టేనని చెబుతున్నారు. పరీక్షల్లో చీటింగ్ అరికట్టడం ద్వారా జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చామని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు 10లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 10వ తరగతి ఉత్తీర్ణత 81.2శాతం ఉంటే, ఈ ఏడాది అది 71.6శాతానికి పడిపోయింది. అలాగే 12వ తరగతి ఉత్తీర్ణత కూడా 82.6శాతం నుంచి 72.43శాతానికి పడిపోయింది.
దాదాపుగా అన్ని పరీక్ష కేంద్రాల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారని, పోలీసులు కూడా విద్యార్థులు స్వేచ్ఛగా, మరింత ఉన్నతంగా పరీక్ష రాసేందుకు సహకరించారని యోగి చెప్పుకొచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారంతా ఎలాంటి చీటింగ్ లేకుండా ఉత్తీర్ణులయ్యారని ప్రశంసించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications