కామ పిశాచులు: లిఫ్ట్ ఇస్తానని చెప్పి క్లాస్మేట్ను అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం
ఒడిషా: ఒడిషాలో దారుణం చోటుచేసుకుంది. కలిసి చదువుకునే విద్యార్థులూ కామాంధుల్లా మారారు. తోటి విద్యార్థినిపై అత్యాచారంకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదు మంది విద్యార్థులు అమ్మాయిపై పైశాచికంగా ప్రవర్తించారు. నమ్మి వారి వెంట వెళ్లడమే ఆమె చేసిన పాపం... అంతలోనే కామంతో కళ్లు మూసుకుపోయి జంతువులకంటే దారుణంగా ప్రవర్తించారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఒడిషాలోని సుందర్గఢ్లోని అడవులకు తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. జూన్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని తన ఇంటి దగ్గర వదిలి బయటకు చెబితే ప్రాణాలు తీసేందుకు వెనకాడబోమని భయపెట్టారు. కింజిరికేలా డిగ్రీ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది బాధితురాలు. కొన్ని రోజులుగా కాలేజీకి వెళ్లకపోవడంతో తన తల్లి బంధువులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలిని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు.

ఎప్పటిలాగే కాలేజీకి తన స్కూటీ పై వెళ్లిందని జూన్ 26న తన స్కూటీ తాళాలు ఎక్కడో పోగొట్టుకుందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక కాలేజీ తర్వాత ఇంటికెళ్లాల్సి ఉండగా ఆమె క్లాస్మేట్స్ అయిన నలీంద్ర ఓరామ్, జయదేబ్ కిసాన్లు ఆమెను తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని వారి బైకుపై తీసుకెళ్లారు. నలీంద్ర ఓరామ్ అనే నిందితుడు బాధితురాలు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వారిని నమ్మిన బాధితురాలు వారి బైకు ఎక్కింది. ఇక సగం దూరం వెళ్లాక దట్టమైన అడవుల్లోకి లాక్కెళ్లారు. మధ్యలో మరో మిత్రుడు రంజిత్ ఓరామ్ కలిశాడు. ఆ తర్వాత మరో క్లాస్మేట్ వచ్చాడు. ఇలా వంతులుగా ఒక్కొక్కరూ అమ్మాయిపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఇంటిదగ్గర వదిలి వెళ్లి బెదిరించి వెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు గిరిజన యువతి అని తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి ముగ్గురని అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications