భారీ వర్షంలో దీదీ గారి గరం గరం చాయ్
కోల్కత: పశ్చిమబెంగాల్లో పంచయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. గ్రామస్థాయిలో ఏ పార్టీకి పట్టు ఉందో తేల్చి పారేసే ఎన్నికలు ఇవి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- వీటిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఫలితంగా అక్కడి రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో 3,317 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 జిల్లా పరిషత్లలో 928 సీట్లు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 63,229 గ్రామ పంచాయతీ వార్డుల్లో జులై 8వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 11వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 20 జిల్లాల్లో మూడంచెలుగా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,36,464 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి 85,817 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ 56,321 మంది అభ్యర్థులను రంగంలో దించింది. సీపీఎం 48,646, కాంగ్రెస్- 17,750 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో ఎవరు విజేత అనేది జులై 11వ తేదీన తేలుతుంది.
ఈ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీజేపీకి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు తృణమూల్ కాంగ్రెస్. తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. తానే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోన్నారు.
ఇందులో భాగంగా ఆమె ఇవ్వాళ జల్పాయ్గురి జిల్లాలో పర్యటించారు. ఒక వంక భారీ వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయలేదు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే మమత బెనర్జీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మాల్ బజార్లో ఓ టీ స్టాల్కు వెళ్లారు దీదీ. తన స్వహస్తాలతో టీ తయారు చేశారు. గ్లాసుల్లో పోసి మరీ అక్కడున్న ప్రజలకు అందించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications