బొగ్గు కుంభకోణం కేసు: మధు కోడాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బొగ్గు కుంభకోణంలో కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు జనవరి 22 వరకు నిలుపుదల చేసింది. దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో తదుపరి విచారణ వరకు బెయిల్ మంజూరు చేసింది.
అంతేగాక, అతనిపై విధించిన రూ. 25 లక్షల జరిమానాపై కూడా స్టే విధిస్తూ జస్టిస్ అను మల్హోత్రా తీర్పు వెలువరించారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ మధుకోడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సీబీఐ వివరణ కోరుతూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

జార్ఖండ్లోని బొగ్గు గనులను కోల్కతాలోని విని ఐరన్ ఆండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలతో గతంలో ముధుకోడాతో పాటు జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, జోషీలకు ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి దాఖలైన విషయాలన్నింటినీ జనవరి 22న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications