ప్రైవేట్ స్కూల్ నరకమే: తుమ్మితే రూ.200, మాతృభాష మాట్లాడితే రూ.300 ఫైన్, టాయ్లెట్లు కడిగిస్తున్నారు!
ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల దుశ్చర్యలు వెలుగుచూశాయి.
చెన్నై: ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల దుశ్చర్యలు వెలుగుచూశాయి.

తుమ్మితే రూ.200, తమిళ్ మాట్లాడితే రూ.300
విద్యార్థులు తుమ్మితే రూ.200, తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్న సదరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై 9వ తరగతి విద్యార్థిని మంగళవారం కోయంబత్తూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.

ఆకృత్యాలు అన్నీఇన్నీకావు..
విద్యార్థిని లక్ష్మీ తన తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్కు వచ్చి కోయంబత్తూరు జిల్లా సెట్టిపాళయంలోని పాఠశాలలో జరుగుతున్న అకృత్యాలను వివరించింది. విద్యార్థులెవరైనా తుమ్మితే తమ పీటీ మాస్టర్ రూ.200 జరిమానా విధిస్తున్నాడని, ఒకటి కంటే ఎక్కువసార్లు తుమ్మితే పాఠశాల మైదానమంతా పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపింది.

మరుగుదొడ్లు కూడా కడిగిస్తున్నారు..
అంతేగాక, తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్నారని, ఒకటి కంటే ఎక్కువ సార్లు అలా జరిమానా కట్టిన విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ కన్నీటి పర్యాంతమైంది. జరిమానా కట్టకపోతే పాఠశాల మైదానం చుట్టూ పదిసార్లు పరుగు పెట్టిస్తున్నారని వాపోయింది.

టీసీ అడిగితే రూ. 15వేలు..
ఇంటి నుంచి తీసుకొచ్చిన నీళ్లు తాగొద్దంటున్నారని, పాఠశాల ట్యాంకులోని మురికి నీరే తాగాలని ఆదేశిస్తున్నారని పేర్కొంది. ఈ వేధింపులతో విసిగిపోయిన విద్యార్థులు ఎవరైనా టీసీ అడిగితే రూ.15 వేలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పాఠశాలలోని విద్యార్థులందరికి యాజమాన్యం నరకం చూపిస్తోందని వాపోయింది. సదరు విద్యార్థిని ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications