జేఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాలు వాస్తవమే!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాయలంలో జాతి వ్యతిరేక నినాదాలు వినిపించిన మాట వాస్తవమేనని తేలింది. ఫిబ్రవరి 9న ఢిల్లీలోని సదరు వర్సిటీలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది.
ఈ ర్యాలీలో అఫ్జల్ గురు ఉరితీతకు సంబంధించి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. అఫ్జల్ ఉరిని 'జ్యూడీషియల్ కిల్లింగ్'గా అభివర్ణించిన ఓ వర్గం విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ మేరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) తనకు అందిన వీడియోలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సదరు ర్యాలీలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు ఇలా ఉన్నాయి.
-
తుమ్
కిత్నే
అఫ్జల్
మారోంగే,
ఘర్
ఘర్
సే
అఫ్జల్
నికలేంగే
-
పాకిస్థాన్
జిందాబాద్
-
కాశ్మీర్
మాంగే
ఆజాదీ,
లడ్కర్
లేంగే
ఆజాదీ
-
కాశ్మీర్
కి
ఆజాదీ
తక్,
జంగ్
రహేగీ-
జంగ్
రహేగీ
-
భారత్
కి
బర్బాదీ
తక్,
జంగ్
రహేగీ-
జంగ్
రహేగీ
-
అఫ్జల్కి
హత్యా
నహీ
సహేంగీ...
తరహా
నినాదాలతో
విద్యార్థులు
హోరెత్తించారని
తేల్చింది.
ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కాగా, ఉమర్, భట్టాచార్యలను బయటికి పంపిన వర్సిటీ యాజమాన్యం.. ఉమర్కు రూ. 20వేల జరిమానా విధించింది. జూలై 23 నుంచి అనర్బన్పై ఐదేళ్ల నిషేధం విధించింది. కన్నయ్య కుమార్కు రూ. 10వేల జరిమానా విధించింది.