గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే...
గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైకా కారణం దిగ్విజయ్ సింగేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
పనాజి: ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన సంఖ్యా బలానికి చాలా దగ్గరగా ఉండి, ఒక చిన్న పార్టీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైకా కారణం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఆయనతోపాటు గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ వల్లే తమకు అధికారం దక్కలేదని గోవా పీసీసీ చీఫ్ లుజిన్హో ఫాలైరో తీవ్ర ఆరోపణలు చేశారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది.

మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో...
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కి కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండడంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటు చేస్తామనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికి రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముందు కాంగ్రెస్ కే మద్దతు...
నిజానికి తాము మద్దతిస్తామంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ముందుగా దిగ్విజయ్ సింగ్ తోనే చెప్పారు. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్ వైపు వస్తే.. మరొక్క స్వతంత్ర అభ్యర్థి మద్దతు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు.

గవర్నర్ ను కలవకపోవడం వల్లనే...
కానీ అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే గోవాలో అధికారం కాంగ్రెస్ చేజారిందనేది స్థానిక నాయకుల వాదన. ముందుగా గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఉంటే, అతిపెద్ద పార్టీగా ముందు తమకే అవకాశం వచ్చి ఉండేదని ఫాలైరో వ్యాఖ్యానించారు. చివరికి మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

మద్దతు ఉందిగానీ.. సంతకాల్లేవు
దిగ్విజయ్ సింగ్ స్పందించి ఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అప్పటికి సిద్ధంగా ఉన్నారు. మార్చి 11వ తేదీ రాత్రికి తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అయితే తమ వద్ద వాళ్ల సంతకాలు మాత్రం లేవని ఫాలైరో చెప్పారు.

ముందుచూపు శూన్యం...
కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో అన్ని అధికారాలను దిగ్విజయ్, వేణుగోపాల్ కు ఇచ్చిందని, వాళ్లు సకాలంలో స్పందించకపోవడం.. మరోవైపు బీజేపీ వెంట వెంటనే స్పందించడం వల్లే తమకు అధికారం దూరమైందని ఆయన వాపోయారు. మొత్తానికి కాంగ్రెస్ ఇలా గోవాలో అధికారానికి దూరమైందన్న మాట.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications