షాకింగ్: కుమారస్వామికి దొరకని గవర్నర్ అపాయింటుమెంట్? కాంగ్రెస్ ముందు 3 ప్లాన్లు
బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమార స్వామి గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ చేరుకున్నారు. జేడీఎస్ శాసన సభా పక్షం ఆయనను జేడీఎస్ఎల్పీగా ఎన్నుకున్న అనంతరం సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్ వచ్చారు.
తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరనున్నారు. ఈ మేరకు తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పించనున్నారు. అయితే కుమారస్వామికి గవర్నర్ అపాయింటుమెంట్ దొరకలేదని తెలుస్తోంది.

అంతకుముందు బీజేపీఎల్పీ యడ్యూరప్ప గవర్నర్ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. ఓ వైపు బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని ఆరోపిస్తున్న జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ ఎమ్మెల్యేలపై కన్నేశాయి. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపుకు రావాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ - జేడీఎస్ల ముందు మూడు వ్యూహాలు
గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ముందు మూడు వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. 1. జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్ద పరేడ్ నిర్వహించడం. 2. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం. 3. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించడం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications