అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడకండి, అలా చేయొద్దు: జేడీఎస్-కాంగ్రెస్ ఆదేశాలు
బెంగళూరు: మన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలో, లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో మాట్లాడవద్దని కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు ఆదేశించాయని సమాచారం. యడ్యూరప్ప బలనిరూపణ సమయంలోను బీజేపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని, అందరూ మౌనంగా ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది.
శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఓ వైపు తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం, మరోవైపు జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలు జారీపోతున్న పరిస్థితుల్లో యెడ్డీ అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఫ్లోర్ టెస్టుకు ముందు బీజేపీ నేతలు ప్రకాశ్ జవదేకర్, మురళీధర రావులను ముఖ్యమంత్రి యడ్యూరప్ప కలిశారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications