లోకేష్ను ఏకేసిన నగ్మా: ఆస్తులపై ట్విట్టర్లో ఉతికేసింది!..
ఓవైపు నోట్ల రద్దు పుణ్యమాని సామాన్యులు రోడ్డున పడితే.. లోకేష్ లాంటి సామాన్యులు మాత్రం అసామాన్యంగా మారారని నగ్మా ఆరోపించారు. నగ్మా చేసిన ఈ ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
లక్నో: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన చూపించిన ఆస్తుల లెక్క వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం ఆస్తులు ప్రకటించినప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.14.5కోట్లు కాగా, ఐదు నెలల వ్యవధిలోనే అసాధారణ రీతిలో వాటి విలువ రూ. 330కోట్లకు చేరుకోవడం గమనార్హం.
దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేయగా.. ఆస్తులన్ని సక్రమమే అని మీడియా ముందుకు వచ్చి లోకేష్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే లోకేష్ ఆస్తుల వివాదం జాతీయ స్థాయిలోను అందరి దృష్టిని ఆకర్షించింది. హిందూస్తాన్ టైమ్స్ లాంటి పత్రికలు సైతం లోకేష్ ఆస్తులపై విస్మయం వ్యక్తం చేశాయి.
tweet:#DeMonetisation has really been a boon to the #NDA, see here how it had helped a common man become the uncommonly rich. #jhumla #Modi pic.twitter.com/jtz9z3Jdx9
— Nagma Morarji (@nagma_morarji) March 10, 2017
ఇదే క్రమంలో ఒకప్పటి సినీ నటి, ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు నగ్మా సైతం లోకేష్ ఆస్తులపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించిన నగ్మా.. ఇది ఎన్డీయే పాలనకు అద్దం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఓవైపు నోట్ల రద్దు పుణ్యమాని సామాన్యులు రోడ్డున పడితే.. లోకేష్ లాంటి సామాన్యులు మాత్రం అసామాన్యంగా మారారని నగ్మా ఆరోపించారు. నగ్మా చేసిన ఈ ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవడమే గాక, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, కొన్ని స్టార్టప్ సంస్థలు సైతం మూతపడ్డాయని, 125మంది సామాన్యులు చనిపోయారని నగ్మా గుర్తుచేశారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications