కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీ
Recommended Video

ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో గా ఆయన అభివర్ణించారు.అది ఒక అబద్దాల పుట్టగా పేర్కోన్నారు. ఆరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు.
ప్రజలను తెలివి తక్కువ వారిని చేసేందుకు అబద్దాలతో కూడిన మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో కూడా ఇలాంటీ అబద్దపు హమీలే ఇచ్చిందని, ఇప్పుడు కూడ అదే రీతీలో వాటిని హామీలను ఇస్తుందని అన్నారు. కాగా 2004 లో ప్రతి గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పిస్తామని హమీ ఇచ్చారని కాని 2014 వరకు కూడ 18000 వేల గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదని అన్నారు.

ఈనేపథ్యంలోనే అది మ్యానిఫెస్టో కాదు ప్రజలను వంచించే అబద్దాల పుట్టగా పేర్కోన్నారు. కాగా మరోసారి భాజపా అధికారంలోకి వస్తే దేశాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తామని అన్నారు. కాగా రైతులను మోసం చేసి ఓట్లు అడిగే పార్టీ తమది కాదని మోదీ అన్నారు. ఈనేపథ్యంలోనే రైతులకు సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నామని తెలిపారు. ఇక ఎన్నికలు నమ్మకానికి ,అవినితీకి ,కుట్రకు మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications