సన్మాన పత్రమా?: 2జీ కేసులో కాంగ్రెస్ వైఖరిపై జైట్లీ ఫైర్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో పటియాలా హౌస్ కోర్టు తీర్పుపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ సన్మాన పత్రంలా భావిస్తోందని, ఆ వైఖరి సరికాదని జైట్లీ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video

2012లో అవినీతి, మోసపూరిత పాలసీ అని సుప్రీంకోర్టు తేల్చిందని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేశారు. అంతేగాక అన్ని లైసెన్సులు కూడా నిలిపేసిందన్నారు. 2జీ కేటాయింపులు సక్రమమని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు.
Congress leaders are treating this judgement as some kind of a badge of honor & a certification that it was an honest policy: Arun Jaitley #2GScamVerdict pic.twitter.com/Y6fWNXVW5t
— ANI (@ANI) December 21, 2017
తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ సంబరపడిపోతోందని, అయితే, నిబంధనలకు విరుద్ధంగా 2జీ కేటాయింపులు జరిగాయని జైట్లీ ఆరోపించారు. యూపీఏ హయాంలో 2007లో కేటాయించిన 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను 2001 రేట్లకనుగుణంగా కేటాయించి, ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చారని మండిపడ్డారు.
యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఛార్జీషీటు తిరిగి పరిశీలించాలని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అరుణ్ జైట్లీ చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications