గాలి, భీమా నాయక్ కేసు సీబీఐకి: కాంగ్రెస్
బెంగళూరు: ప్రత్యేక భూస్వాధీనాధికారి భీమా నాయక్ కారు డ్రైవర్ రమేష్ ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విధాన పరిషత్ సభ్యుడు (ఎంఎల్ సీ), ప్రముఖ న్యాయవాది వీ.ఎస్. ఉగ్రప్ప డిమాండ్ చేశారు.
రెవెన్యూ శాఖ అధికారి (కేఏఎస్) అధికారి భీమా నాయక్ అక్రమాస్తుల గురించి, అతని అరాచకాల గురించి వెలుగు చూడాలంటే సీబీఐ దర్యాప్తు సరైన మార్గం అని అన్నారు. ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, భీమా నాయక్ మీద మండిపడ్డారు.

గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకుడు అని గుర్తు చేశారు. ఆయన తన కుమార్తె పెళ్లి చెయ్యడం కోసం రూ. 100 కోట్ల పాత నోట్లను భీమా నాయక్ ఇచ్చి కొత్త నోట్లుగా మార్చుకున్నాడని రమేష్ ఆత్మహత్య చేసుకునే ముందు డోత్ నోట్ లో రాసి పెట్టాడని గుర్తు చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్వయం ప్రేరితంగా స్పందించి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఉగ్రప్ప డిమాండ్ చేశారు.
నగదు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, ఇలాంటి విపయాల్లో కేంద్రం స్వతంత్రంగా సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత నోట్ల మార్పిడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉగ్రప్ప కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటక అధికారులు చిక్కరాయప్ప, జయచంద్రల కేసులు కూడా సీబీఐకి అప్పగించాలని ఉగ్రప్ప డిమాండ్ చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications