కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్: నేడు మల్లిఖార్జున ఖర్గే నామినేషన్, తివారీ కూడా!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో పాల్గొంటారని, రాజసభలో ప్రతిపక్ష నాయకుడు పార్టీ అత్యున్నత పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఏఎన్ఐ నివేదించింది .
ఈ పదవి కోసం ఇప్పటికే దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ మధ్య పోటీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, మల్లిఖార్జున ఖర్గే బరిలోకి రావడంతో దిగ్విజయ్ సింగ్ వెనక్కి తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు తాజాగా భేటీ కావడం గమనార్హం.
కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుండగా, అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.
"ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ విధేయులలో ఒక వర్గం తనను సంప్రదించడంతో ఖర్గే తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే, తుది నిర్ణయం త్వరలో తీసుకోవాల్సి ఉంది అని ఏఎన్ఐ పేర్కొంది.
గాంధీలు ఈసారి అత్యున్నత పదవికి పోటీ చేయకపోవడంతో.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ 25 ఏళ్ల తర్వాత గాంధీయేతర అధ్యక్షుడిని పొందేందుకు సిద్ధంగా ఉంది.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు ముందు, జి-23 నాయకులు కొందరు ఆనంద్ శర్మ నివాసంలో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా హాజరయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు తలెత్తిన మొత్తం పరిస్థితులపై నేతలు చర్చించారు. నేతలు మరోసారి భేటీ కానున్నట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం ఈ గ్రూపు నుంచి ఒక నాయకుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఏఎన్ఐ నివేదించింది.
"ఇంకా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అది పూర్తయిన తర్వాత, ఆలోచన ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైంది. బీఎస్ హుడా, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్.. నేను చర్చల కోసం కూర్చుని సంఘటనల గురించి చర్చించాము' అని మనీష్ తివారీ పేర్కొన్నారు.
ఇప్పటివరకు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు పేర్లు వచ్చిన అభ్యర్థులకు G-23 మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించగా.. 'నామినేషన్ పత్రాలను సేకరించడం, దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడం మధ్య రోజులు గడిచిపోతున్నాయి. ఆ సమయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆంగ్లంలో దీనిని రాజకీయాల్లో 'ఇది సంభావ్యత ప్రాధాన్యత' అని పిలుస్తారు. రేపు ఏమి జరుగుతుందో చూద్దాం' అని మనీష్ తివారీ అన్నారు. G-23 నాయకులు అన్ని స్థాయిలలో సంస్థాగత పునర్నిర్మాణం మరియు అంతర్గత ఎన్నికలను కోరారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ సింగ్ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను సేకరించి, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అత్యున్నత పదవికి నామినేషన్ల దాఖలు సెప్టెంబరు 30 వరకు, ఎన్నికలు అక్టోబర్ 17న జరుగుతాయి. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.