కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: 2 దశాబ్దాల తర్వాత గాంధీయేతరుల పోటీ
న్యూఢిల్లీ: సోమవారం (అక్టోబర్ 17)నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత జరుగుతోన్న పార్టీ అధ్యక్ష ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ ఎన్నికల విభాగం తెలిపింది. పోలింగ్లో సభ్యులకు కీలక సూచనలు చేసింది.
బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు ముందు 1 లేదా 2 అనే అంకెలకు బదులు టిక్ మార్క్ చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ సభ్యులకు చేరవేశామని తెలిపింది. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారనే విషయం తెలుసుకోవడం సాధ్యం కాదు.
ఓటు వేసే అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు పక్కన టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల విభాగాధిపతి మధుసూదన్ మిస్త్రీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 9100 మందికిపైగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 19వ తేదీన లెక్కింపు, తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.

రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఈసారి గాంధీ కుటుంబేతర వ్యక్తులు పోటీ ఉండటంతో పోటీ ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఈ నేతలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. తమ ఇద్దరి మధ్య పోటీ స్నేహపూర్వకమేనని, ఎవరు ఎన్నికైనా పార్టీ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు.
కాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 17న యాత్రకు విరామం ఇచ్చి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. యాత్ర కొనసాగుతున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపు వద్దే రాహుల్ తన ఓటు వేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications