ప్రజాతీర్పును శిరసావహిస్తోన్నా: ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమల్ నాథ్..
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 20 మంది కమల దళ అభ్యర్థులు ఉండగా.. కేవలం ఏడుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆధిక్యం స్పష్టం కావడంతో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ స్పందించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరించారు.
బై పోల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కమల్ నాథ్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల లీడ్ ఉన్న చోట ఓటర్లు చూపిన అభిమానానికి థాంక్స్ చెప్పారు. 7 నెలల క్రితం జ్యోతిరాదిత్య సిందియా కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. సిందియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీంతో కమల్ నాథ్ సీఎం పీఠం నుంచి దిగాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. అయితే 20 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా వెళుతున్నారు. 7 చోట్ల కాంగ్రెస్, బీఎస్పీ నుంచి ఒకరు లీడ్లో ఉన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు ముగ్గురు ఆదిల్ సింగ్ కాన్సానా, గిరిరాజ్ దండొటియా, ఓపీఎస్ భడొరియా ట్రయల్లో ఉండటం విశేషం. భడొరియా 175 ఓట్ల దూరంలో ఉన్నారు.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications