కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పని చేస్తాం: బీజేపీ కుట్రలంటూ రాహుల్ గాంధీ ఫైర్
నాగ్పూర్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్పుర్లో 'హై తయార్ హమ్' (మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.
రాజకీయ అధికారం కోసం జరిగే పోరాటానికి సిద్ధాంతమే పునాది అని.. సామాన్యులకు అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ చాలా మంది ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా కాకుండా అనుకూలమైన వారికే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బాధ్యతలు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ఇండియా కూటమే దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాదిరి కాకుండా తమ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకత్వాన్ని ప్రశ్నించగలడని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్తలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఇది(నాగ్పూర్) కాంగ్రెస్ పార్టీ గడ్డ. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా అర్థమవుతాయి. కాంగ్రెస్ పోరాటం మహారాష్ట్ర నుంచే మొదలైంది, అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగ్పుర్ వచ్చాం. మీరు ఎవరికీ భయపడకూడదు. సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇది. మనమంతా కలిసి మహారాష్ట్రతోపాటు దేశంలో జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు.
VIDEO | "There is a war between two ideologies. There are several parties in NDA and INDIA alliance, but the war is between two ideologies," says Congress leader @RahulGandhi during party's 'Hain Tayyar Hum' rally in Nagpur. pic.twitter.com/ectlOYCZco
— Press Trust of India (@PTI_News) December 28, 2023
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపర్చాలని ప్రజలను కోరారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి బీజేపీ తమ ఎంపీని కాపాడేందుకు 147 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటికి పంపిందని ఖర్గే ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తే మహిళలకు సాధికారత కల్పించే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications