ఐటి ఉద్యోగులే టార్గెట్, దోపిడీ: ముఠా సభ్యుల పట్టివేత

అరెస్టయిన దోపిడీ ముఠా అనుమానితుల్లో ఒకతను ఖలీద్ అహ్మద్ షేక్ (32) సతారా జిల్లాలోని కన్హేరీ ఖందాలాకు చెందినవాడు కాగా, నితాంత్ గిరీష్ పవార్ (23) అనే మరొకతను పూణేలోని నవీ సంగ్వీకి చెందినవాడు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పరారీలో ఉన్న ఒకతన్ని పూణేలోని పింపుల్ గురువ్ ప్రాంతంలోని సలీం పాపా షేక్గా గుర్తించారు. వాళ్లంతా పాత నేరస్థులే. పోలీసులు నిందితుల నుంచి రెండు కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు దోపిడీల్లో తమ పాత్రను ఇద్దరు కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
దోపిడీ కేసుల్లో నిందితులు షేక్, పవార్ ఐటి కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేశారు. ముంబైకి వెళ్లే దారిలో నిలబడేవారికి వాళ్లు లిఫ్ట్ ఇస్తుండేవారు. తమను ప్రయాణికులుగా చెప్పుకుని వారు వాహనాల్లో ఎక్కించుకునేవారు. వారు కారులో ఎక్కగానే వెనక ప్రయాణికుల మాదిరిగా కూర్చున్నవారు వారిని కొట్టేవారు. పదునైన ఆయుధాలతో బెదిరించేవారు. వారి వద్ద ఉన్నవాటిని దోచుకుని నిర్మానుష్యంగా ఉన్న చోట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయేవారు.












Click it and Unblock the Notifications