కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: 100మందికిపైగా మృతి, 400కిపైగా గాయాలు, ప్రధాని దిగ్బ్రాంతి
భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
Rushing to the site in Odisha. My prayers for the speedy recovery of the injured and condolences to the bereaved families.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 2, 2023
Rescue teams mobilised from Bhubaneswar and Kolkata. NDRF, State govt. teams and Airforce also mobilised.
Will take all hands required for the rescue ops.
తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్పై వస్తోన్న యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ రైలు కోరమాండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్కతా వెళుతోంది. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రమాద ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.
#WATCH | Coromandel Express derails near Bahanaga station in Balasore, Odisha. pic.twitter.com/9Lk2qauW9v
— ANI (@ANI) June 2, 2023
ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 60 అంబులెన్స్ లు సేవలందిస్తున్నాయి.
Share Maximum pic.twitter.com/nwlbkNqCJJ
— Narendra Modi fan (@narendramodi177) June 2, 2023
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి: మృతులకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం నుంచి అంతా క్షేమంగా బయటపడాలని కోరుకున్నారు. ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించింది.
Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all…
— Narendra Modi (@narendramodi) June 2, 2023
కాగా, కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్ వద్ద ఈ సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమయన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైనవారు 033- 22143526/ 22535185 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

కాగా, పశ్చిమ బెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ షాలిమార్లో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరుతుంది. సంత్రగాచి జంక్షన్, ఖరగ్పూర్ జంక్షన్, బాలేశ్వర్, భద్రతక్, జాస్పూర్ కే రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications