భారత్ లో కరోనా ఉధృతి : 41,965 కరోనా కొత్త కేసులు, 460 మరణాలు, కేరళలో నో కంట్రోల్, థర్డ్ వేవ్ భయం !!
భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే నిన్ను తగ్గుముఖం పట్టిన కేసులు ఈరోజు మళ్లీ పెరిగాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గత 24 గంటల్లో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 30,203 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో 2 వంతులకు పైగా కరోనా కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
భారత్ లో మొత్తం కరోనా కేసులు 3.28 కోట్లు
తాజా కేసులతో కలిపి భారత దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి 3.19 కోట్ల మంది బయట పడ్డారు. గత 24 గంటల్లో 33,964 మంది కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. నిన్న నమోదైన మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి మరణాలలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 115 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొత్త కేసులు పెరుగుతున్న కారణంగా క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా 3,78,181 క్రియాశీల కేసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల రేటు 1.15 శాతంగా ఉంది. దేశంలో సెప్టెంబరు అక్టోబరు నెలలో కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఐసీఎమ్ఆర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ -19 టీకా వేగం పుంజుకుంది. తాత్కాలిక డేటా ప్రకారం, భారతదేశం మంగళవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 1.25 కోట్లకు పైగా మోతాదులను ఇచ్చింది, ఇది ఒకే రోజులో రికార్డు స్థాయిలో సాగిన వ్యాక్సినేషన్.
65 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు
టీకాలలో దేశం 1 కోటి మైలురాయిని దాటడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి. రికార్డు టీకాలతో, భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 వ్యాక్సిన్ కవరేజ్ కూడా 65 కోట్లు దాటింది. మొదటి డోస్తో దాదాపు 50 కోట్లు ఇవ్వబడ్డాయి. ఐదు రోజుల వ్యవధిలో రెండవ రోజు 1 కోటికి పైగా డోస్లు అందించిన ఘనత సాధించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దేశ ప్రజలను ప్రశంసించారు. ఆగస్టు నెలలో, భారతదేశంలో రికార్డు స్థాయిలో 18.12 కోట్ల డోసులు నిర్వహించగా, జూలైలో 13.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. టీకా యొక్క రోజువారీ సగటు కూడా జూలైలో 43.41 లక్షల నుండి 58.46 లక్షలకు పెరిగింది.
ప్రపంచానికి కొత్త వేరియంట్ టెన్షన్ .. పండుగలపై కేంద్రం అలెర్ట్
ఏదేమైనా, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ కరోనావైరస్ కేసుల పెరుగుతున్న ధోరణిని చూస్తున్నాయి. కేరళ దేశానికి ప్రధాన ఆందోళనగా ఉంది. గత కొన్ని వారాలుగా భారతదేశంలోని కోవిడ్ -19 కేసులలో సగానికి పైగా దక్షిణ రాష్ట్రం కేరళ నివేదిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని పరిమితం చేయడానికి కేరళ ఆదివారం రాత్రి కర్ఫ్యూ మరియు లాక్డౌన్ను తిరిగి అమలు చేసింది. అలాగే, ప్రస్తుతం ప్రపంచానికి C.1.2 కోవిడ్ -19 వేరియంట్ కొత్త టెన్షన్ పెడుతుంది. యూకేలో మొదట కనుగొనబడిన వేరియంట్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పండుగ సీజన్ లో కరోనా మహమ్మారి విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం పండుగలపై అలర్ట్ చేస్తుంది. కోవిడ్ ప్రోటోకాల్ని పాటించడంలో ఏమాత్రం అలసత్వం వహించినా అది కరోనా మహమ్మారిని కట్టడి చేయడాన్నికష్టతరం చేస్తుందని హెచ్చరిస్తుంది.












Click it and Unblock the Notifications