ఇండియాని వణికిస్తున్న కరోనా.. మహారాష్ట్రపై పంజా, రెండు కొత్త వేరియంట్లతో ఆందోళన!
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200కు పైగా నమోదు అయినట్టుగా తెలుస్తుంది.
మహారాష్ట్రలో జోరుగా కరోనా కేసులు
మొత్తం మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 209 గా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా పూణేలో 35 కేసులు నమోదు కాగా, ముంబైలో ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జనవరి నెల నుంచి మహారాష్ట్రలో 300 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

మే నెలలో కరోనా కేసుల పెరుగుదల
అయితే జనవరి నెల నుంచి నమోదైన కరోనా కేసుల వివరాలను చూస్తే జనవరి, ఫిబ్రవరి నెలలలో ఒక్కో కేసు నమోదు కాగా, మార్చి నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు . మే నెలలో నాలుగు కేసులు నమోదు కాగా అత్యధికంగా మే నెలలో 252 కేసులు నమోదయ్యాయి. ఒక్క మే నెలలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం.
మహారాష్ట్రలో తాజాగా ఒకరు మృతి
అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు మరణాలు సంభవించాయి. కాగా తాజాగా మహారాష్ట్ర దానిలో కోవిడ్ తో 21 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా దేశంలో కరోనా కేసులలో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేరళలో మే నెలలో 278 కరోనా యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
కర్ణాటకలో ఒకరు మృతి, దేశంలో రెండు కొత్త వేరియంట్ లు
బెంగళూరులో కరోనా సంబంధిత మరణం ఒకటి నమోదయింది. 84 సంవత్సరాల వృద్ధుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు.భారతదేశంలో కరోనా వైరస్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళనను కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ NB 1.8.1, LF.7 సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది.
కొత్త వేరియంట్లు కేసుల పెరుగుదలకు కారణం అన్న డబ్ల్యూ హెచ్ ఓ
ఇటు చైనాలోనూ, ఆసియా లోను కరోనా కేసులో పెరుగుదలకు ఈ కొత్త వేరియంట్లు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications