భారత్ లో గణనీయంగా తగ్గిన కరోనా కొత్త కేసులు .. 30,549 తాజా కేసులు, 422మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో నిన్నటి వరకు 40 వేలకు పైచిలుకు నమోదైన కరోనా కేసులు, ఒక్కసారిగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో 30,549 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారతదేశంలో కేసులు 3,17,26,507 కి పెరిగింది. దాదాపు 422 మంది రోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు . మొత్తం మరణాలు 4,25,195 గా నమోదయ్యాయి.
భారతదేశంలో గత 24 గంటల్లో 38,887 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,08,96,354 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 4,04,958 గా ఉన్నాయి. సోమవారం 4,13,718 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఈరోజు అవి బాగా తగ్గాయి. భారతదేశంలో మంగళవారం కేసుల సంఖ్య సోమవారం కంటే 9,585 తక్కువగా ఉంది. నిన్న భారతదేశంలో 40,134 కొత్త కేసులు గుర్తించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కోవిడ్ -19 కొరకు ఇప్పటి వరకు మొత్తం 47,12,94,789 నమూనాలను పరీక్షించారు. ఇందులో గత 24 గంటల్లో 16,49,295 పరీక్షలు చేయబడ్డాయి. అధికారులు ఇప్పటివరకు 47,22,23,639 మందికి టీకా డోస్లు ఇచ్చారు. అందులో 36,79,94,586 మంది మొదటి డోస్ అందుకున్నారు.10,42,29,053 మంది రెండు డోస్లు అందుకున్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన పౌరులలో ఎక్కువ మందికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ లేదా భారత్ బయోటెక్ కోవాక్సిన్ మోతాదులను అందిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, గౌహతి, కొచ్చి, కోల్కతా సహా కొన్ని నగరాలు కూడా రష్యా యొక్క స్పుత్నిక్ వీ వ్యాక్సిన్తో ప్రజలకు టీకాలు వేస్తున్నాయి. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు స్పుత్నిక్ వీ ని సరఫరా చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, స్థానికంగా తయారు చేసిన మోతాదులు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి భారతదేశంలో అందుబాటులో ఉంటాయని సోమవారం తెలిపింది. ఇక కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి జరుగుతుందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా థర్డ్ వేవ్ విజృంభణ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications