భారత్ కు ఊరట .. 30,093 కేసులతో నాలుగు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు, 374మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్త కేసులు 30 వేలకు తగ్గాయి. తాజా కేసులు నాలుగు నెలల కనిష్టానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. తాజాగా 30,093 కొత్త కేసులను నమోదు చేయడం, కేసుల సంఖ్య బాగా క్షీణించడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.
చివరిసారిగా భారతదేశం యొక్క కోవిడ్ -19 సంఖ్య 30,000 మార్కు కంటే తక్కువగా మార్చి నెలలో ఉంది. మార్చి 16 న దేశం 28,903 కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా 374 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 414,482 కు చేరుకుంది. మూడు నెలలకు పైగా భారతదేశం చూసిన అతి తక్కువ మరణాల సంఖ్య కూడా ఇదే అని చెప్పాలి. మార్చి 30 న భారతదేశం 400 కంటే తక్కువ మరణాలను చూసింది. అప్పుడు 354 మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసులు 15,535 తగ్గాయి. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,130 కి తగ్గాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం. దేశంలో నివేదించబడిన మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇవి 1.35% గా ఉన్నాయి.
గత 24 గంటల్లో కనీసం 45,254 మంది అంటు వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 3,03,53,710 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దీంతో భారత దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి పునరుద్ధరణ రేటు 97.32 శాతానికి చేరుకుంది. ఏది ఏమైనా క్రియాశీల కేసులు నాలుగు లక్షలకు తగ్గడం, మరణాలు మూడు నెలల కనిష్టానికి, ఒక కొత్త కేసులు నాలుగు నెలల కనిష్టానికి తగ్గటం భారతదేశానికి కాస్త ఊపిరి నిస్తుంది.












Click it and Unblock the Notifications