యూఏఈలో గర్భిణీ ప్రియాంకకు కరోనా: తల్లీ, బిడ్డను కాపాడిన తుంబే ఆస్పత్రి, అన్నీతామై..
అబూదాబి: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అజ్మన్ నగరంలో భారతీయ దంపతులు ఉంటున్నారు. కాగా, గర్భిణీ అయిన మహిళ కరోనా మహమ్మారి బారినపడింది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే చేరింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూలో చేర్చారు. పుట్టే బిడ్డకు కరోనా సోకకుండా సీజేరియన్ చేశారు వైద్యులు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.

కరోనా బారిన పడిన ప్రియాంక..
ప్రియాంక, ఆమె భర్త సోమేష్ అజ్మన్ నగరంలో ఉంటున్నారు. పండంటి బిడ్డ పుట్టడం, ఆ శిశువుకు కరోనా సోకకపోవడంతో ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అనుభవాల గురించి ప్రియాంక మాట్లాడుతూ.. తాను ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి ఒక రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని చెప్పింది. జ్వరంగా కూడా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంకకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరింది.

బిడ్డకు కరోనా సోకకుండా డెలివరీ..
ప్రియాంక అనారోగ్యం మరింతగా క్షీణించడంతో ఆమెను ఐసీయూలోకి తరలించారు. 33 వారాల గర్భిణీ అయిన ఆమెకు సీజేరియన్ చేసి బిడ్డను ఆరోగ్యంగా బయటికి తీయాలని వైద్యులు తలచారు. అనుకున్నట్లుగానే ఆమెకు సిజేరియన్ చేశారు. ప్రియాంకకు పండింటి బిడ్డ పుట్టింది. వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించి బిడ్డకు కరోనా సోకలేదు. వైద్యులు తన ప్రాణాలతోపాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడారని ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.

కరోనాను జయించిన ప్రియాంక..
కాగా, దాదాపు నెల రోజులపాటు శిశివును న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసియూ)లోనే ఉంచారు. బిడ్డతోపాటు తన భార్య క్షేమంగా ఆస్పత్రి నుంచి ఇంటికి రావాలని ప్రియాంక భర్త సోమేష్ అందరు దేవుళ్లను ప్రార్థించారు. ఈ క్రమంలో ప్రియాంక క్రమంగా కోలుకుంది. చివరకు కరోనాను కూడా జయించి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.
Recommended Video

పూర్తి ఆరోగ్యంతో ఇల్లు చేరిన ప్రియాంక, ఆమె కూతురు
ప్రియాంకతోపాటు ఆమె కూతురు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక త్వరలోనే కేరళలోని సొంతూరుకు వచ్చేందుకు సోమేష్ సిద్ధమయ్యారు. వైద్య ఖర్చులన్నీ తాను పనిచేసే తుంబే ఆస్పత్రి యాజమాన్యమే భరించిందని ప్రియాంక వెల్లడించింది. కరోనా రోగులకు అందించిన వైద్య సేవలకు గానూ తాము ప్రియాంక, ఆమె కూతురు వైద్య ఖర్చులను భరించామని ఆస్పతరి యాజమాన్యం తెలిపింది. తుంబే ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులకు ప్రియాంక, ఆమె భర్త సోమేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications