Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ ఎంపీ జస్‌కౌర్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరిం నిర్మించిన తర్వాతనే కరోనా వైరస్ సమూలంగా నిర్మూలన జరుగుతోందన్నారు. మీనా.. రాజస్తాన్‌లో దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైరస్ నిర్మూలనకు అయోధ్యలో మందిరం నిర్మాణం ఒక్కటే పరిష్కారం అని నొక్కి వక్కనించారు. ఆధ్యాత్మిక శక్తులను నమ్మే విశ్వాసనీయులం, అనుచరులందరూ.. కూడా తనతో ఏకీభవిస్తారని తెలిపారు.

మీనా వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే అంతకుముందు మరో బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా ఇలానే కామెంట్లు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగాకే దేశంలో వైరస్ అంతమొందుతుందని చెప్పారు. ఆ తర్వాత మీనా కూడా మందిరానికి, వైరస్‌కు లింక్ పెడుతూ కామెంట్లు చేశారు.

Corona will be destroyed as soon as Ram temple is built: BJP MP Jaskaur Meena

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కరోనా వైరస్ వల్ల 200 మంది అతిథులకే మాత్రమే భూమి పూజలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నారు. వాస్తవానికి భూమి పూజ ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ పెరగడం, లాక్ డౌన్ వల్ల అదీ ఆగస్ట్ 5వ తేదీన నిర్వహించబోతున్నారు.

Recommended Video

    V Haumantharao Slams BJP & Also Requested AICC To Recognise Party Workers

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+