వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: కరోనాతో హంగర్ ఇంక్. కో ఫౌండర్ ప్లాయిడ్ కార్డొజ్ మృతి, ముంబైలో సోకిన వైరస్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు పది మంది చనిపోగా.. బుధవారం మరొకరు మృతిచెందారు. అయితే అతను ఈ నెల 8 వరకు ముంబైలో ఉండి.. అమెరికాలో వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్లాయిడ్ కార్జొజ్ మృతిచెందారు.

న్యూయార్క్‌లో మృతి..

న్యూయార్క్‌లో మృతి..

ప్లాయిడ్ కార్డొజ్.. హంగర్ ఇంక్. కో ఫౌండర్, ద బౌంబే క్యాంటిన్, ఓ పెడ్రో రెస్టారెంట్‌లో చీఫ్ చెఫ్‌గా కూడా పనిచేశారు. ఆయన బుధవారం న్యూయార్క్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌తో చనిపోయారు. ఈ నెల 8వ తేదీ వరకు కార్డొజ్ ముంబైలో ఉన్నారు. తర్వాత న్యూయార్క్ వెళ్లారు. అక్కడ వైరస్ బయటపడటంతో.. ఈ నెల 18వ తేదీన తనకు కరోనా సోకిందని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కార్డొజ్.. బుధవారం చనిపోయారు. అయితే ముంబై పర్యటనలో కార్డొజ్ ఎవరెవరిని కలిశారు అనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. వారి వివరాలు సేకరించి.. కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కార్డొజ్ మృతిని కూడా లెక్కిస్తే దేశంలో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 11కి చేరింది.

 ముంబైలో ఇద్దరు..

ముంబైలో ఇద్దరు..

ముంబైలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరగా, దేశవ్యాప్తంగా 10కి చేరింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి సోమవారం ముంబైలో చనిపోయారు. అతని కిడ్నీ పనిచేయక చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. 69 ఏళ్ల వృద్దుడు వైరస్ సోకి చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఇతని మృతితో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకున్నది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇది బెంగాల్‌లో మొదటి కరోనా మరణం అని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ నుంచి కుటుంబంతో సహా కోల్‌కతా రాగా.. అతని కుమారుడు మాత్రం బాగానే ఉన్నారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 పాట్నాలో ఒకరు

పాట్నాలో ఒకరు

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పుణెలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

English summary
Chef Floyd Cardoz, co-founder, Hunger Inc. Hospitality and popular chef of restaurants like The Bombay Canteen and O Pedro passed away on Wednesday in New York due to Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X