ఓవైపు రాఖీలు కట్టించుకోవడం... మరోవైపు అమ్మాయిపై అత్యాచారం...!
ఓవైపు సమాజ సేవ మరోవైపు పసిమొగ్గలపై అత్యాచారం...చేస్తూ పోలీసులకు పట్టబడ్డాడు ఓ కార్పోరేటర్... ప్రతి సంవత్సరం వందలాదీ మందితో రాఖీలు కట్టించుకుంటూ... సంవత్సర కాలంగా ఓ పదకోండేళ్ల అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు మధ్యప్రదేశ్కు చెందిన ఇండిపెండెంట్ కార్పోరేటర్.
మధ్యప్రదేశ్లో రాజేందర్ సింగ్ చౌహాన్ [59]సంవత్సరాల కార్పోరేటర్ ఓ పదకొండు సంవత్సరాల అమ్మాయిపై గత సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు.. ఇక రాజేందర్ సింగ్ను చౌహాన్ స్థానికంగా ఖెండు బాబాగా కూడ పిలుస్తారు.. అయితే ఇటివల ఆయన చేస్తున్న అత్యాచారంతోపాటు పలు మోసాలపై ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు..దీంతో బహిరంగా లేఖను అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు...
విచారణలో భాగంగా భాదితురాలితోపాటు రాజేందర్ సింగ్ భార్య ,కుమారులను విచారించారు. దీంతో బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారించిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు..అనంతరం చౌహాన్పై పలు కేసులు నమోదు చేశారు...దీంతో చౌహాన్ పోలీసుల ముందు లోంగిపోయాడు..
అయితే... కొసమెరుపు ఏమిటంటే రాజేందర్ సింగ్ చౌహాన్ రక్షబంధన్ పేరుతో ప్రతి సంవత్సరం ఓ కార్యక్రమాన్ని కూడ నిర్వహిస్తాడు.. వందాలదీ మహిలళతో రాఖీలు కూడ కట్టించుకుంటాడని పోలీసుల విచారణలో తెలిపారు.