Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫలితాలు: గెహ్లాట్ రిజైన్, షీలాపై కేజ్రీవాల్ గెలుపు

న్యూఢిల్లీ: ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మిజోరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన వెలువడనున్నాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

- రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఆయన ఓటమిని అంగీకరించారు.

- షీలా దీక్షిత్‌పై సామాన్యుడు అర్వింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. షీలా దీక్షిత్‌పై 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

- రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ ఖాతా తెరవలేదు.

 Counting for elections to 4 states begins

- శాసనసభ ఎన్నికల్లో ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యుడు కారని, ఓటమికి రాహుల్ గాంధీని నిందించడం సరి కాదని రాజీవ్ శుక్లా అన్నారు.

- తాము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు.

- ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటింది. పార్టీ పెట్టిన ఏడాదిలోనే గణనీయమైన సీట్లు సాధించింది.

- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓటమిని అంగీకరించారు.

- రాజస్థాన్‌లో బిజెపి చారిత్రిక విజయం సాధించిందని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో రాశారు. వసుంధర రాజే సింధియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించినందుకు శివరాజ్ సింగ్ చౌహన్‌కు మోడీ అభినందనలు తెలిపారు.

- ఢిల్లీలో పరాజయం ఖాయం కావడంతో ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. కాంగ్రెసు పార్టీ మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో 16 ఏళ్ల షీలా దీక్షిత్ ఢిల్లీ పాలనకు తెరపడింది.

- నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయం కావడంతో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

- రాజస్థాన్‌లో తమ విజయానికి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ పనిచేసిందని బిజెపి నాయకురాలు, ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా అన్నారు.

- రాజస్థాన్‌లోని తన నియోజకవర్గం జైరాపటాన్‌లో వసుంధ రాజే సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

- రాజస్థాన్ ముఖ్యిమంత్రి, కాంగ్రెసు అభ్యర్థి అశోక్ గెహ్లాట్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రామనంద్‌గావ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- ఆమ్ ఆద్మీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో ధ్యానం చేస్తున్నారు. బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వెనకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.

- మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హ్యాట్రిక్ దిశగా బిజెపి సాగుతోంది. బిజెపి 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- ఢిల్లీలో మొదటి స్థానంలో బిజెపి కొనసాగుతుందడా, ఆమ్ ఆద్మీ రెండో స్థానంలో, కాంగ్రెసు మూడో స్థానంలో సాగుతున్నాయి.

- రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. బిజెపి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు కేవలం పది స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

- ఢిల్లీలో ఐదు స్థానాల్లో బిఎస్పీ ఆధిక్యతలో ఉంది.

- న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆధిక్యంలో సాగుతున్నారు.

- రాజస్థాన్‌లో బిజెపి దూసుకుపోతోంది. రాజస్థాన్ శాసనసభలో 199 సీట్లు ఉన్నాయి. 17 స్థానాల్లో బిజెపి ఆధిక్యతలో ఉండగా, ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు ఆధిక్యతలో కొనసాగుతోంది

- మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి ప్రారంభంలో లీడ్స్‌లో ఆధిక్యకత ప్రదర్శిస్తోంది.

- ఢిల్లీలోని ఓ సీటులో ఆమ్ ఆద్మీ ఆధిక్యంలో ఉంది.

ఛత్తీస్‌గఢ్ (90 సీట్లు)లో కాంగ్రెసు (7), బిజెపి (7) పోటాపోటీగా ఆధిక్యతను సాధిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+