దేశానికి ఇక వీళ్లంతా అక్కర్లేదు... అవినీతి పరులను జైలుకు పంపడం ఖాయం: మోడీ
ఢిల్లీ: దేశానికి ఇక రాజాలు మహారాజాలు అక్కర్లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏర్పాటు చేసిన మై భీ చౌకీదార్ కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగించారు. చౌకీదార్ అనే పదం వెనకు ఉన్న అసలైన అర్థం దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నందున తనకు చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు. ఇప్పటి వరకు అవినీతి పరులను జైలు వరకు మాత్రమే తీసుకెళ్లానని చెప్పిన ప్రధాని 2019 ఎన్నికల తర్వాత వారిని శాశ్వతంగా జైలుకే పరిమితం చేస్తానని చెప్పారు.

బాలాకోట్ దాడులు ఒకవేళ విజయవంతం కాకపోయి ఉంటే మీరేమి చేసేవారని ఒకరు ప్రధానిని ప్రశ్నించారు. బాలాకోట్ దాడులు చేసింది తాను కాదని దేశ జవాన్లు వారికి ఈ సందర్భంలో తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. "బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలు లేవని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇప్పుడేమో ఆ శిబిరాలు బయట ప్రపంచంకు కనిపించకుండా దాచేస్తున్నారు. అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదు. అంతేకాదు అక్కడ ఓ స్కూలు నిర్మాణం చేసి బయట ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూలు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ పాఠశాల నడుస్తుందని కొత్త కథ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు నా దగ్గర సమాచారం ఉంది" అని మోడీ చెప్పారు. పాకిస్తాన్ పెద్ద డైలామాలో ఉందని ....బాలాకోట్ దాడులు జరిగాయని ఒప్పుకుంటే తమ పరువు బజారును పడుతుందనే ఆలోచనతో పాక్ ఉందని ప్రధాని అన్నారు. బాలాకోట్ దాడులపై ఎవరైతే తనను విమర్శిస్తున్నారో వారు పరోక్షంగా పాకిస్తాన్కు సహకరిస్తున్నారని మోడీ చెప్పారు.
Your vote in 2014:
— Chowkidar Narendra Modi (@narendramodi) March 31, 2019
Brought fear among the corrupt.
Brought accountability among those who looted.
Ensured those who cheated the nation are on bail.
With your vote in 2019, they will head to the place where they really belong, where every looter and criminal should be. pic.twitter.com/HucKSz3P80
ఇక దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని తమ ప్రభుత్వం తిరిగి రప్పిస్తోందని చెప్పారు. వారు ప్రతి పైసా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువగ మాట్లాడితే అంత మంచిదన్న మోడీ ఆ దేశం తన పాపాన అదే నాశనమవుతుందని చెప్పారు. అమెరికా, చైనా దేశాలు దాడులు చేస్తే బహిరంగంగా చేసినప్పుడు భారత్ మాత్రం రహస్యంగా దాడులు ఎందుకు చేయాలని మోడీ ప్రశ్నించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications