జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామికి వచ్చే నెల 30న కోర్టు ముందు హాజరుకావాలని స్దానిక కోర్టు సమన్లు జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఈ సమన్లు జారీ చేశారు.
తమిళనాడుకు చెందిన మత్యృకారుల సమస్యలపై సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా, తమిళ దినపత్రిక దినమలార్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లకు కూడా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సమన్లు జారీ చేశారు.

సుబ్రమణ్య స్వామి దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని జయలలిత వేసిన పిటీషన్లో పేర్కొంది. సిటీ కోర్డులో వేసిన ఈకేసులో స్వామి విమర్శలు ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
నిజానిజాలు తెలుసుకోకుండా బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ఇంటర్యూను ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నై ఎడిషన్ ప్రింటర్, పబ్లిషర్ పైన, ఇంటర్యూ చేసిన విలేకరిపైన కూడా స్దానిక కోర్టులో ముఖ్యమంత్రి తరుపున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ 8వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications