వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా రెండో దశ విలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తూ, రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా, కొవిడ్ మరణాలు మాత్రం ఇంతితై అన్నట్లు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా 13వ రోజూ కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వచ్చాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకాల ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. వివరాలివి..

చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videosచిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videos

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదలచేసిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 లక్షల శాంపిళ్లను పరీక్షించారు. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం తొలిసారి కావడం గమనార్హం. ఆ టెస్టుల్లో కొత్తగా 2,08,921 మంది పాజిటివ్ గా తేలారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది.

covid-19 in india: 2.08 lakh new cases, 4,157 deaths in last 24 hrs, active caseload at 24.95 lakh

దేశంలో నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 4,157 మంది బలయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా రోజువారీ కొత్త కేసులు తగ్గుతూవస్తున్నా మరణాలు మాత్రం 4వేలకుపైగానే కొనసాగుతుండటం ఆందోళనలు రేకెత్తిస్తున్నది. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 3,11,388 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు వదిలారు.

కరోనాలో మోదీ ఎన్నికల వ్యూహాలు -యూపీ అసెంబ్లీపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ మథనం -గంగలో భారీగా మృతదేహాలుకరోనాలో మోదీ ఎన్నికల వ్యూహాలు -యూపీ అసెంబ్లీపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ మథనం -గంగలో భారీగా మృతదేహాలు

నిన్న ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 2,95,955 మంది కోలుకున్నారు. తద్వరా రికవరీల సంఖ్య 2,43,50,816కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 89.26 శాతానికి చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591గా ఉంది. పాజిటివిటీ రేటు 9.60 శాతానికి చేరింది. ఇదిలా ఉంటే,

దేశంలో టీకాల కొరత ఇంకా కొనసాగుతున్నది. సరిపడా వ్యాక్సిన్లు లేని కారణంగా చాలా రాష్ట్రాల్లో 18-44 గ్రూపువారికి వ్యాక్సినేషన్ వాయిదాపడగా, ఉన్న టీకాలను రెండో డోసు వారికి అందజేస్తున్నారు. ఇప్పటివరకు 20,06,62,456 టీకా డోసులను పంపిణీ అయ్యాయయని, నిన్న ఒక్కరోజే 20,39,087 మంది టీకా వేయించుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.

Recommended Video

Tata Steel ఉద్యోగి Covid తో మరణించినా.. జీతం ఆగదు, హ్యాట్సాఫ్ Tata || Oneindia Telugu

English summary
India reported 2,08,921 new Covid-19 cases and 4,157 deaths in the last 24 hours. With this the country’s overall caseload has risen to 2,71,57,795, while the death toll is presently at 3,11,388. According to latest data released by the Union Health Ministry, the country’s active caseload has declined to 24.95 lakh. In the last 24 hours, 2,95,955 patients recovered from the deadly disease. The recovery rate rose to 89.66 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X