ఓఎల్ఎక్స్లో రెమిడిసివిర్ కరోనా ఇంజెక్షన్ విక్రయం, ధరంతో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. మరో కొత్త టీకా రెమిడిస్విర్ను కూడా అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కొరత లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వ్యాక్సిన్లను వృథా చేయొద్దని, బ్లాక్ మార్కెట్లకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కొందరు రెమిడిసివర్ ఇంజెక్షన్ను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
గుజరాత్, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్ఎక్స్ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వయల్ను గరిష్టంగా రూ. 6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, సాధారణంగా ఓఎల్ఎక్స్లో ఎలాంటి మెడిసిన్ల విక్రయానికి అనుమతి లేదు. అలాంటిది కరోనా చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమిడిసివిర్ను ఈ వెబ్సైట్లలో విక్రయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోని బ్లాక్ మార్కెట్లలో వీటి విక్రయాలు జరుగుతున్నాయి. అంతేగాక, డిమాండ్ పెరుగుతుండటంతో కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ దందాపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.
దేశంలో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా 2 లక్షలకుపైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేద్రం.. రాష్ట్రాలకు స్పష్టం చేసింది. మాస్కు పెట్టుకోని వారికి ,జరిమానాలు కూడా ప్,రలజకు అరెస్ట్ చేశ