హైదరాబాద్ స్త్రీకి అవుగుండె: చెన్నై డాక్టర్ల ప్రతిభ
చెన్నై: చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవు గుండెను అమర్చి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలికి 11 సంవత్సరాల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్యంగానే తిరిగిన ఆమె, గత ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది.
దీంతో ఆమె చికిత్స కోసం చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ అనంతరామన్ మాట్లాడుతూ సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైందని, ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.
ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నదైన మొత్తానికి మూడు గంటల పాటు వైద్యుల బృందం శ్రమించడంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.