నిజాయితీపరులను రక్షించేందుకు ఓ వ్వవస్ధ సృష్టించాలి: నారాయణ మూర్తి
బెంగుళూరు: ఇన్పోసిస్ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రస్తుత వ్యవస్ధ తీరుతెన్నులపై స్పందించారు. దేశంలోని నిజాయతీపరులైన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలను కాపాడుకునేందుకు ఓ సమర్ధవంతమైన యంత్రాగాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నిక్కచ్ఛిగా ఉండే వారు తమ తమ పనులను నిర్భయంగా చేసుకునేందుకు తగిన వ్యవస్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో బొగ్గ గనుల కేటాయింపుల వ్యవహారంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు కుంభకోణం సామాన్య జనాలను భయాందోళనలకు గురి చేస్తోందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, భీకర వాతావరణం నెలకొంటే, దేశ ఆర్ధిక వ్యవస్ధ ముందుకుపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచిపనులను చేసిందని, నిజాయితీపరులైన రాజకీయనాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల రక్షణ అంశం కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
ఇటీవలే బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, హిందాల్కో చీఫ్ కుమార మంగళం బిర్లా తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కుమార మంగళం బిర్లా తనకు ఎంతోకాలం నుంచి తెలుసునని, అతను చాలా మంచివాడని నారాయణమూర్తి కితాబిచ్చారు. బొగ్గు కుంభకోణంలో తనపై కూడా అభియోగాలు నమోదైన సందర్భంలో వారిని తప్పుబట్టడం ఎంత మాత్రం సరికాదని చెప్పారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications