Crime: తల్లిని చంపేసి కబోడ్ లో పెట్టి ప్లాస్టింగ్ చేసిన కూతురు, కొడుకుతో ఎస్కేప్ !
బెంగళూరు: పైలెట్ కావాలనే ఆశతో యువకుడు ఏరోనాటిక్ చదివాడు. తల్లి, అమ్మమ్మతో కలిసి అతను బెంగళూరులోనే నివాసం ఉండేవాడు. ఐదు సంవత్సరాల క్రితం తల్లీ, కొడుకు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. కొన్ని నెలల తరువాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి చూడగా ఇంటి కబోడ్స్ ను సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసిన విషయం వెలుగు చూసింది. కబోడ్స్ పగలగొట్టి చూడగా ఇంట్లో వృద్దురాలు అస్తిపంజరం బయటపడ్డాయి. ఇంట్లో నివాసం ఉంటున్న మహిళ ఆమె తల్లిని చంపేసి కొడుకుతో కలిసి పారిపోయిందని వెలుగు చూసింది. హత్య జరిగిన ఐదు సంవత్సరాల తరువాత తల్లీ కొడుకు పోలీసులకు చిక్కిపోయాడు. తల్లిని ఆమె కూతురు ఎందుకు హత్య చేసిందని అని అసలు విషయం తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయరు. మహిళ శవం కబోడ్స్ లో చిక్కడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.
Girl: స్కూల్ వాష్ రూమ్ లో అమ్మాయి మీద సీనియర్లు సామూహిక అత్యాచారం, మహిళా కమీషన్ నోటీసు!
బెంగళూరులో కాపురం
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబకు చెందిన వాసుదేవ్ రావ్, రాధా దంపతులు బెంగళూరు చేరుకుని కంగేరి ఉపనగరలో అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. వాసుదేవ్ రావ్, రాధా దంపతులకు సంజయ్ (27) కుమారుడు ఉన్నాడు. పైలెట్ కావాలనే ఆశతో సంజయ్ బెంగళూరులో ఏరోనాటిక్ చదివాడు.
తల్లి టార్చర్ పెడుతోందని కోపం
రాధా తల్లి శాంతకుమారి కూడా వీరితోనే ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం వాసుదేవ్ రావ్ చనిపోయాడు. తరువాత రాధా, ఆమె తల్లి శాంతకుమారి, కుమారుడు సంజయ్ కొంతకాలం ఉన్నారు. హోటల్ నుంచి టిఫిన్, భోజనం తీసుకువస్తే శాంతకుమారి తినకుండా ఆమె కూతురు రాధా, మనుమడు సంజయ్ ను వేధించేదని తెలిసింది. ఇదే విషయంలో శాంతకుమారి ఆమె తల్లి మీద కోపం పెంచుకుంది.
తల్లిని చంపేసిన కూతురు
2017లో తల్లి శాంతకుమారి టార్చర్ పెడుతోందని రాధా పెద్ద కర్ర తీసుకుని ఆమె మీద దాడి చేసింది. తలకు తీవ్రగాయాలు కావడంతో మూడు రోజులు ఇంట్లోనే నానా ఇబ్బందులు పడిన శాంతకుమారి చనిపోయింది. శాంతకుమారి హత్యకు గురైయ్యిందని తెలిస్తే జైలుకు పోవలసి వస్తుందని రాధా, ఆమె కొడుకు సంజయ్ భయపడిపోయాడు.
కోల్లాపూర్ వెళ్లిపోయారు
శాంతకుమారి శవాన్ని ఇంటి కబోడ్స్ లో పెట్టేశారు. మూడు రోజుల తరువాత శవం దుర్వాసన రాకుండా ఉప్పు, మట్టి వేసి సిమెంట్ తో కబోడ్స్ పూర్తిగా మూసేసి ప్లాస్టింగ్ చేశారు. నాలుగు నెలల పాటు శవం దుర్వాసన రాకుండా స్ప్రే కొట్టి మేనేజ్ చేశారు. నాలుగు నెలలు అక్కడే కాపురం ఉన్న రాధా, ఆమె కొడుకు సోరబాలో ఉన్న మా నాన్నకు అనారోగ్యంగా ఉందని, ఊరికి వెళ్లి వస్తామని ఇంటి యజమానికి చెప్పి ఇంటికి తాళం వేసి మహారాష్ట్రోని కొల్లాపూర్ వెళ్లిపోయారు.
పైలెట్ కావలసిన యువకుడు హోటల్ లో సప్లేయర్
కొల్లాపూర్ వెళ్లిన రాధా హోటల్ లో వంటమనిషిగా చేరింది. పైలెట్ కావాలని ఆశపడిన రాధా కుమారుడు సంజయ్ అదే హోటల్ లో సప్లేయర్ అయ్యాడు. కొల్లాపూర్ వెళ్లిన తరువాత బెంగళూరు, శివమొగ్గలోని బంధువులు, స్నేహితులతో ఎవరికి టచ్ లో లేకుండా రాధా, సంజయ్ కాలం గడిపారు.
ఇంటి యజమాని షాక్
రాధా, ఆమె కొడుకు సంజయ్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన కొన్ని నెలల తరువాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి చూడగా ఇంటి కబోడ్స్ ను సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసిన విషయం వెలుగు చూసింది. కబోడ్స్ పగలగొట్టి చూడగా ఇంట్లో వృద్దురాలు శాంతకుమారి అస్తిపంజరం బయటపడింది.
బ్యాంక్ అంకౌట్ దెబ్బతో తల్లీ, కొడుకు అరెస్టు
ఇంట్లో నివాసం ఉంటున్న రాధా ఆమె తల్లి శాంతకుమారిని చంపేసి కొడుకు సంజయ్ తో కలిసి పారిపోయిందని వెలుగు చూసింది. హత్య జరిగిన ఐదు సంవత్సరాల తరువాత తల్లీ రాధా, ఆమె కొడుకు సంజయ్ ఓ బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా బెంగళూరులోని కంగేరి పోలీసులకు చిక్కిపోయారు. శాంతకుమారిని ఆమె కూతురు రాధా టార్చర్ పెడుతోందని హత్య చేసిందని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.