కూల్ కుమారస్వామి: ఎవరు ఏం చేసినా నేను ఏం పట్టించుకోను అంతే, కర్ణాటక సీఎం, బీజేపీ !
బెంగళూరు: సంకీర్ణ ప్రభ్వుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ప్రయత్నించినా, వేరేవాళ్లు ప్రయత్నించినా తనకు ఏమీ సంబంధం లేదని, తనపని తాను చేసుకుని వెలుతానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం తన మొదటి ప్రాధాన్యత అని సీఎం కుమారస్వామి కూల్ గా చెప్పారు.
అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన సీఎం కుమారస్వామి సోమవారం మద్యాహ్నం మొదటి సారి మీడియాతో ముందుకు వచ్చి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల ఎటు దారితీస్తున్నాయని మీడియా ప్రశ్నించగా కుమారస్వామి పై విధంగా స్పందించారు. నా కంటే మీకే ఎక్కువ సమాచారం ఉందని, అనవసరమైన విషయాలు తాను పట్టించుకోనని సీఎం కుమారస్వామి అన్నారు.

ముఖ్యమంత్రిగా తన ముందు ఏ భాద్యతలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తానని, మిగిలిన వాటి గురించి ఆలోచించే సమయం తనకు లేదని సీఎం కుమారస్వామి అన్నారు. బీజేపీ వాళ్లు ఆపరేషన్ కమల మొదలు పెట్టినా తనకు అభ్యంతరం లేదని, మిగిలిన వాళ్లు ఎలాంటి కుట్రలు చేసినా తాను పట్టించుకోనని సీఎం కుమారస్వామి చెప్పారు.
శనివారం కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, సోమవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేశారు. ఇంత జరుగుతున్నా తాను ప్రస్తుత రాజకీయాల గురించి పట్టించుకోనని సీఎం కుమారస్వామి చల్లగా చెబుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications