2 గ్రూపులు ఆయుధాలతో కొట్టుకుంటుంటే, తాపీగా వీడియో తీశారు
బెంగళూరు: కర్నాటకలో దారుణం జరిగింది. మరో షాకింగ్ విషయమేంటే ఆ దారుణాన్ని ప్రజలు కళ్లారా చూస్తూ కూడా ఆపలేకపోయారు. మరికొందరు అయితే దానిని తమ తమ సెల్ వీడియో తీశారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం మంగళవారం నాడు హసన్ నగరంలోని బస్ స్టాండులో జరిగింది.
ఇది బెంగళూరుకు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు గ్రూపులు తగాదాపడ్డాయి. ఇరు వర్గాలు కూడా ప్రాణాంతకమైన ఆయుధాలు పట్టుకొని ఘర్షణకు దిగారు. అక్కడ అప్పుడు వందల మంది ఉన్నారు. కానీ ఎవరూ కూడా స్పందించలేదు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు.

మరో విషయమేమంటే ఒకరిద్దరు వ్యక్తులు ఆ ఘటనను తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పెట్టారు. అంత గొడవ జరుగుతున్నా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని వీడియోలో చూసిన పోలీసులు షాకయ్యారు.
దీనిపై హసన్ ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. రెండు గ్రూపులు కనీసం 8 నిమిషాల పాటు ఘర్షణ పడ్డాయని, అక్కడ చూస్తున్న వారు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని, వారి గొడవను చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఆ తర్వాత పది నిమిషాలకు విషయం తెలిసి, పోలీసులు వెళ్లి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications